గోవా టూర్ ను ప్రారంభించిన డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు..

Published: Tuesday November 30, 2021
తల్లాడ, నవంబర్ 29 (ప్రజాపాలన న్యూస్): ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తల్లాడ మండల ఎంపీటీసీలు గోవా బాట పట్టారు. ఈ మేరకు తల్లాడ మండల ఎంపీటీసీలు అందరూ గోవా టూర్ కు సన్నద్ధమై తరలివెళ్లారు. సోమవారం గోవా వెళ్లే బస్సును ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు జెండా ఊపి ప్రారంభించారు. తల్లాడ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డం వీరమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు అందరూ ఏకమై గోవా టూర్ కు తరలి వెళ్లారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ రాయల జిల్లా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గోవా టూర్ కు తరలించినట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, టిఆర్ఎస్ జోన్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జీవీఆర్), సరికొండ కస్తూరిరాజు, తల్లాడ మండల ఎంపీటీసీలు పాల్గొన్నారు.