పశుసంవర్ధక ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

Published: Tuesday January 24, 2023
జన్నారం, జనవరి 22, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లే గ్రామ పంచాయితీలో సోమవారం పశు వైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి ఆవులు, గేదెలలో ఉచిత గర్భ కోశ వ్యాధి చికిత్సలు నిర్వహించి,  పరీక్షలు నిర్మించామన్నారు. గ్రామంలో మేకలు, గొర్రెలు, కోళ్లు కు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. పశు గ్రాసం పెంపకం, జంతు సంరక్షణ పైన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పశు వైద్య సంరక్షణ శాఖ అధికారి డాక్టర్ వై రమేష్, కమ్మన్ పల్లి సర్పంచ్ పేరు మానస, ఎంపిటిసి దునుగూరి మాధరి, తపలాపూర్ పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్, గోపాలమిత్ర సూపర్వైజర్ ఏ రవి, పశువర్ధక సిబ్బంది కిషన్, సాగర్, సంజీవ్, రెహమాన్, రాజన్న, పాడి రైతులు, పశు యజమానులు, తదితరులు పాల్గొన్నారు.