సమస్త మానవాళికి యేసుక్రీస్తు బోధనలే మూలం.. టీసీసీ రాష్ట్ర అధ్యక్షులు డేవిడ్ సుదర్శనం..

Published: Tuesday October 11, 2022

 కల్లూరు, అక్టోబర్ 11 (ప్రజాపాలన న్యూస్): సమాజంలో సమస్త మానవాళికి యేసుక్రీస్తు బోధనలే మూలమని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మానుకొండ డేవిడ్ సుదర్శనం అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షులు సేవియా నాయక్ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డేవిడ్ సుదర్శన్ మాట్లాడుతూ క్రైస్తవులందరూ తమ హక్కుల సాధన కోసం కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటుచేసి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. అనంతరం డేవిడ్ సుదర్శనంను జిల్లా పాస్టర్లు శాలువాలు, పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ సిహెచ్ రమేష్ బాబు, రాష్ట్ర కన్వీనర్ యం.నిరీక్షణ రావు, రీజనల్ కోఆర్డినేటర్ లాజర్ నాయక్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మధుసూదన్, మహిబాబూబాద్ జిల్లాలో తొమ్మిది మండల దైవజనులు పాల్గొన్నారు.