పట్టు, ఉద్యానవన సాగుపై విజ్ఞాన యాత్రకు తరలిన రైతులు

Published: Friday February 12, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ సాగుపై అవగాహన సదస్సుకు రైతులు తరలివెళ్లారు. జగిత్యాల జిల్లా ఉద్యానవన శాఖ  ఆధ్వర్యంలో ఎస్సి,ఎస్టీ  రైతులకు విజ్ఞాన యాత్రలో భాగంగా ములుగు సిద్దిపేట జిల్లాల ఉద్యానవన పంటల సందర్శన కార్యక్రమాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ రైతులు అధికారులు పాల్గొన్నారు.