ఉప్పల్ 108 అంబులెన్స్ లో మహిళా ప్రసవం
Published: Friday March 10, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ నివాసైన పెద్దిరాజు లక్ష్మీ 35 నాలుగవ ప్రెగ్నెంట్ కావడంతో ఉప్పల్ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఉప్పల్ 108 సిబ్బంది లక్ష్మీ నివాస స్థలముకు వెళ్లి గాంధీ హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా పురిటి నొప్పులు అధికం కావడంతో మార్గ మధ్యలోనే 108 లోనే లక్ష్మీ మగ బిడ్డకు జన్మ ఇవ్వడం జరిగింది. తల్లి బిడ్డను గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ వెంకటరమణ వీరికి సేవలు అందించారు.
Share this on your social network: