అంతర్జాతీయ స్థాయి క్రీడాకారునికి ఆర్థికంగా చేయూత

Published: Friday June 04, 2021
కోరుట్ల, జూన్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): అంతర్జాతీయ స్థాయి అండర్ 19 కబడ్డీ పోటీలకు ఎంపికైన  కోరుట్ల మండలంలోని చిన్న మెట్ పల్లి గ్రామానికి చెందిన అబ్బోల్ల జస్వంత్ అను క్రీడాకారుడు ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి అండర్-19 కబడ్డీ సెలక్షన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ లో జరిగే అండర్ 19 కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారునికి ఐదు వేల రూపాయలు ఆర్థికసహాయం చేసిన ఎంపీపీ తోట నారాయణ. ఈ సందర్భంగా ఎంపీపీ తోట నారాయణ మరియు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావూ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జస్వంత్ అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం మన మండలానికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సురేష్ గౌడ్, ఎంపిటిసిలు నరసయ్య, సుభాష్ రెడ్డి, గంగాధర్, కో ఆప్షన్ ఖయ్యుం లు పాల్గొన్నారు.