యోగా ని దినచర్యలో భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Tuesday June 22, 2021
బెల్లంపల్లి, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : యోగాని ప్రతి ఒక్కరూ తన దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోని ఆచరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు స్థానిక నంబర్ 2 గ్రౌండ్లో స్వామి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ యోగ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు వారి వారి దిన చర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని నాలుగు కాలాల పాటు మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగాని తప్పక అలవాటు చేసుకొని ఆచరించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, యోగా మాస్టర్లు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: