ఇబ్రహీంపట్నం మండలంలో మూడు కోట్ల 63 లక్షల తో పలుఅభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Monday October 11, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిది : ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, ముక్కునూర్, దండుమైలారం గ్రామాలలో 3కోట్ల 63లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించిన ఎమ్మెల్యే శమంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాయపోల్ సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి మొగులూరు సర్పంచ్ శివరాల జ్యోతి రాజు దండుమైలారం సర్పంచ్ రావణ మౌని మల్లీశ్వరి జంగయ్య మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులు, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.