25 కెవి విద్యుత్ ట్రాన్స్ఫారంతో విద్యుత్ సమస్యకు చెక్: సర్పంచ్ భాగం శ్రీనివాసరావు
Published: Monday September 05, 2022
బోనకల్, సెప్టెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామం లో సంవత్సరంగా కరెంటు లో వోల్టేజ్ వల్ల రాత్రి సమయంలో కరెంట్ లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే సర్పంచ్ బాగం శ్రీనువాసరావు మండల పరిషత్ సమావేశంలో విద్యుత్ అధికారులు తెలియజేయడం జరిగింది. గతం లో 15Kvటాన్సపరమ్ కావడం తో తో విద్యుత్ అధికారులు స్పందించి గ్రామం లో 25 KV ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి గ్రామం లో కరెంటు సమస్య పరిష్కారం చేయడం తో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు లకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాగం శ్రీనువాసరావు మాట్లాడుతూ గ్రామంలో కరెంట్ సమస్య ఎప్పుడూ వచ్చిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి రిపేర్ చేసి గ్రామ ప్రజలు లకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు , గ్రామ ప్రజలు ,పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: