గుమ్మడిదల లో 25 నుంచి బోనాలు ఉత్సవాలు : గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్ రెడ్డి

Published: Friday July 23, 2021

గుమ్మడిదల, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండల కేంద్రంలో ఆషాడ మాసం సందర్భంగా గ్రామదేవతల బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ 25 జూలై ఆదివారం నాడు పోచమ్మ బోనాల పండుగ 27 జూలై మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాల పండుగ గ్రామ దేవాలయ కమిటీ, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బోనాల పండుగలో పాల్గొని భక్తులందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి రావాలని ఆయన కోరారు.