సొంత ఖర్చులతో సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేయిస్తున్న గోనె శ్రీకాంత్ ముదిరాజ్

Published: Wednesday May 05, 2021
మేడిపల్లి, మే4 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో చిలుకానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ తమ సొంత ఖర్చులతో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా డివిజన్ పరిధిలోని బీరప్పగడ్డలో సోడియం హైపోక్లోరైట్  ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా గోనె శ్రీకాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ రెండోదశలో కరోనా మహామ్మారి మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రభుత్వాల కొవిడ్ నిబంధనలను పాటిస్తూూ, ఇళ్లలో సురక్షితంగా ఉండాలని అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి, బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తోట సమ్మయ్య, పటేల్, చిలుకానగర్ డివిజన్ బిజైవైయం అధ్యక్షులు డప్పు దత్తసాయి, ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ గుప్తా, శ్రీనివాస్, సురేష్, రాజు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.