గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్

Published: Thursday December 16, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలం పెద్దభూద గ్రామానికి చెందిన తుంగడ నరేందర్ అనే వ్యక్తిని గుడుంబా తయారు చేస్తుండగా అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సి ఐ మహేందర్ తెలిపారు. బుధవారం  ఆయన మాట్లాడుతూ నాటుసారా (గుడుంబా) తయారు చేస్తూ అమ్ముతు న్నాడని అందిన ముందస్తు సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఎస్, చంద్రశేఖర్ ఆదేశానుసారం బుధవారం తుంగడ నరేందర్ ఇంట్లో సోదాలు చేయగా అక్కడ సుమారు 2 లీటర్ల గుడుంబా, మరియు 50 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధంగా వున్న బెల్లం పానకం లభ్యం అయ్యాయని తెలిపారు. ఈ సోదాల్లో యస్.ఐ.లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, శ్యామసుందర్ లు పాల్గొన్నారని ఆయన తెలిపారు.