రాయికల్ ప్రభుత్వ హాస్పిటల్ స్థలంలో - ప్రైవేట్ వ్యక్తుల పాగా

Published: Wednesday June 29, 2022
రాయికల్, జూన్ 28 ( ప్రజాపాలన ప్రతినిధి ):
రాయికల్ ప్రభుత్వ హాస్పిటల్ కు సంబంధించిన స్థలములో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించిన వ్యవహారంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి అట్టి భూమిని హాస్పిటల్ చెందినదిగా రెవిన్యూ అధికారులు నిర్ణయించిన ఇప్పట్టి వరకు హాస్పిటల్ కు సంబంధించిన అధికారులు ఆ భూమిని తమ అధీనంలోకి తీసుకోక పోవటాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అలాగే హాస్పిటల్ ను సందర్శించి ప్రజలకు గైనాకలోజిస్ట్ అందుబాటులో ఉండటంలేదని దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి గైనాకలోజిస్ట్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించండలేదని ఎవరు సెలవులోఉంటున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ఆసుపత్రి సిబ్బంది ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
 
Attachments area