కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

Published: Wednesday July 20, 2022

కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఈడి వేధింపులు

వికారాబాద్ బ్యూరో జూలై 19 ప్రజాపాలన : 
కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ  వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ లు మండిపడ్డారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రసాద్ కుమార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
 కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను ఈ.డి పేరుతో విచారణ చేస్తూ రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తుందన్నారు. దేశంలో అన్ని విధాలుగా త్యాగాలు చేసిన కుటుంబం వారిది. దేశ స్వాతంత్రం కోసం ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబానిధని అన్నారు.స్వంత ఆస్తులను దేశం కోసం త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ నేతలదనీ,ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు.సోనియా గాంధీ పైన అక్రమంగా ఈ.డి కేసు పెట్టి విచారణ పేరుతో వేదిస్తున్నందుకు నిరసనగా 21వ తేదీన హైదరాబాద్ లో ఈ.డి కార్యాలయం ముందు భారీగా ధర్నా చేయనున్నమని ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరి ఈ.డి కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతుందని, కావున ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి గాంధీ కుటుంబానికి అండగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. జూలై 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు సోనియాగాంధీ హాజరుకానున్న నేపథ్యంలో 21వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించారు. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రతి రాష్ట్రంలో..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెల‌పాల‌ని కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైనప్పుడు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ ముదిరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి, వికారాబాద్ మండలం కో ఆప్షన్ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, మండల అధ్యక్షులు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, నాయకులు కమాల్ రెడ్డి, చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.