జగిత్యాల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా జి.చంద్రశేఖర్ గౌడ్ పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం

Published: Tuesday June 22, 2021
జగిత్యాల, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రంధాలయ సంస్థ అభివృద్ధికి తప్పకుండ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కారేక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి జడ్పీ వైస్ చైర్మన్ హరిచరన్ రావు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.