మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మగాంధీ కి ఘన నివాళులు

Published: Monday January 31, 2022
మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ ప్రజలు ఆదివారం నాడు మహాత్మా గాంధీ వర్ధంతిమండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గాంధీ రు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు, అహింసా వాదము, శాంతి సౌభ్రాతృత్వం అనే పద్దతులను ప్రపంచానికి చాటిచెప్పిన గాంధీజీ చిరస్మరణీయుడనీ వారికి యావత్తు మానవజాతికి ఘననివాళుల అర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలనీ అన్నారు.. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ లు కొన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాసరావు, దోర్నాల వీరస్వామి, మైలవరపుచక్రి, మొదలగు వారు పాల్గొన్నారు