డెంగ్యూ వ్యాధి దినోత్సవంపై అవగాహన
Published: Monday May 17, 2021
మధిర, మే16, ప్రజాపాలన ప్రతినిధి : జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున మధిర మండలం phc మాటూరుపేట phc దెందుకూరు, మధిర సివిల్ హాస్పిటల్ వైద్యులు dr వెంకటేష్ dr శ్రవణ్ కుమార్ dr పుష్పలత ఆధ్వర్యంలో పారామెడికల్ hs కొండయ్య hs భాస్కర్ రావు hs కాంతలీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో anms ఆరోగ్య సిబ్బంది డెంగీ వ్యాదిపై భౌతిక దూరం పాటిస్తూ అవగాహన పరిచినారు. మధిర ఎంపీడీఓ ఆఫీస్ మధిర సివిల్ హాస్పిటల్ phc మాటూరుపేట phc దెందుకూరు నందు డెంగీ బ్యానర్స్ డిస్ ప్లే చేసినారు. టైగర్ దోమలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పారామెడికల్ సిబ్బంది, 108 సిబ్బంది, 104 సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: