శీలం పుల్లారెడ్డి కళాశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

Published: Wednesday March 01, 2023

మధిర ఫిబ్రవరి 28 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుశీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం నాడు సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల డైరెక్టర్ శీలం వెంకటరెడ్డి హాజరై సి.వి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేసి సైన్స్ డే సందర్భంగా విద్యార్థులందరికీ స్వీట్లు పంచిపెట్టారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.విద్యార్థులందరూ సర్ సివి రామన్ ని స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదువుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవరెడ్డి,శ్రీహరి,సునీత,డీపీ, నాగరాజు,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.