*అంబేద్కర్ ను అవమానించిన హామార ప్రసాద్ ను దేశ బహిష్కరణ చేయాలి*

Published: Monday February 13, 2023

-మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సాని రమేష్ మాదిగ.

చేవెళ్ల, ఫిబ్రవరి 12( ప్రజా పాలన):-
          
  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీ అవమానించే విధంగా సబ్బండ కులాల మనోభావాలనూ  దెబ్బతీసే విధంగా మాట్లాడిన హమారా ప్రసాద్ ను వెంటనే బహిరంగంగా ఉరిశిక్ష విధించాలనీ లేదంటే దేశ బహిష్కరణ చేయాలని మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్శని రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    హమర ప్రసాద్ అనే ఒక పిచ్చికుక్క సమాజంలో విద్వేషాలు చెలరేగేలా సబ్బండ కులాల మనోభావాలు దెబ్బతీసే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నేను ఆ కాలంలో  పుట్టినట్లయితే రాముడు కృష్ణుడి రహస్యాలు అనే పుస్తకం అంబేద్కర్ రాసినందుకు గాంధీజీని గాడ్సే ఏ విధంగా కాల్చి చంపాడో నేను కూడా అంబేద్కర్ ను గాడ్సే లాగా కాల్చేవాడిని అనుచిత వ్యాఖ్యలు చేసిన హామర ప్రసాద్ ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు.
    మేము వేదాలు వింటే చెవుల్లో సీసాలు పోసి మేము అక్షరాలు నేర్చుకుంటే మా నాలుకలు కత్తిరించి మమ్మల్ని విద్యకు దూరం చేసినటువంటి మనువాద బ్రాహ్మణ సమాజంపై తిరుగుబాటు చేసి సమాజంలో అన్ని కులాలు సమానత్వాన్ని సాధించడం కై దేశంలో అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడం అంటే అది ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని,భారతదేశాన్ని అవమానించడమే.
      ఇలాంటి చిల్లర పనికిమాలిన హౌలాగాని,సమాజంలో ఏ బాధ్యత లేనటువంటి వ్యక్తి సమాజంలో విద్వేషాలు చెలరేగేలా భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడడం వెనుక ఏ శక్తులు ఉన్నాయో కనిపెట్టి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
   వెంటనే ప్రభుత్వలు చొరవ తీసుకొని చట్టపరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి గుణపాఠం చెప్పేవిధంగా ఇతని దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు.