ప్రభుత్వ పాఠశాలకు సీసీ కెమెరాలు అందించిన సర్పంచ్

Published: Wednesday October 26, 2022

జన్నారం, అక్టోబర్ 25, ప్రజాపాలన: మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ అప్పర్ ప్రాథమిక పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలు అందించడం జరిగిందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ తమ సొంత డబ్బులతో ఉచితంగా ప్రభుత్వ పాఠశాలకు సిసి కెమారాలు ఏర్పాటు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ ప్రభుత్వ అప్పర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఆ గ్రామ సర్పంచికి అభినందనలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.