వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రఘునాథ్ యాదవ్

Published: Saturday August 27, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన/ఆగస్ట్ 26 : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ, ఈ నెల 31న ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి డివిజన్లోని పలు గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించారు.
*డివిజన్ కమిటీ కన్వినర్ గా రక్తపు సందీప్ గౌడ్*
కొండాపూర్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు సాగర్ అధ్యక్షతన డివిజన్ కమిటీ కన్వినర్ గా రక్తపు సందీప్ గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా కాంటెస్టెడ్ కార్పొరేటర్ బిజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, హిందూ ధర్మ ప్రచారక్ బాలాజీ కాలనీ ముఖ్యనాయకులు బల్లు యాదవ్, కొండాపూర్ లోని వివిధ మండపాలా కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ అన్ని గణేష్ మండపలా వద్ద ఎలాంటి వివాదాస్పద కార్య కలాపాలకు తవియ్యకుండా, పూర్తి భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు. మండపాలా వద్దా ఏటువంటి సమస్యలు ఉన్నా కమిటీ కన్వినర్ దృష్టికి తీసుకురావాలని, వారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారని తెలిపారు. తదనంతరం కమిటీకి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు. 
*క్యుఐఎస్ఎస్ఎ రెస్టారెంట్ ను ప్రారంభం* 
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని క్యుఐఎస్ఎస్ఎ రెస్టారెంట్ ను కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నిర్వాహకులు ఎం.మహేష్ యాదవ్, ఆర్ రాఘన్ రెడ్డీ లకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మిత్రులు అరుణ్ యాదవ్ శ్రీకాంత్ ఉదయ్ లు పాల్గొన్నారు.