సిద్దిపేట జిల్లా భట్రాజు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Tuesday January 24, 2023
సాహితీ ప్రవీణులు, సరస్వతి పుత్రులు గా పిలవబడే భట్రాజుల కుల సంఘం ఎన్నికలు సిద్దిపేట జిల్లాలో ఆదివారం తాడూరి బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం తరపున క్రాంతి వర్ధన్ రాజు, శ్రీకాంత్ రాజు హాజరవగా సిద్దిపేట జిల్లా భట్రాజు నూతన కార్యావర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా గౌర్రాజు  అశోక్ రాజు, ప్రధాన కార్యదర్శి గా సింగాభట్టు రామరాజు, కోశాధికారిగా వ్యాసభట్టు దయానందరాజు,గౌరవ అధ్యక్షుడుగా బాపురాజు,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కేశవరాజు,రాజేంద్ర ప్రసాద్ రాజు,ఉపాధ్యక్షులుగా రాంచందర్ రాజు,దేవరాజు,
సంయుక్త కార్యదర్శిగా ఎర్రమరాజు సాయి కృష్ణరాజు,కార్యనిర్వాహక సభ్యులుగా 
సంతోష్ రాజు,శ్రీనివాస్ రాజు,ప్రసాద్ రాజు,
సందీప్ రాజు,సంతోష్ కృష్ణ
మీడియా ఇంచార్జిగా గౌర్రాజు కృష్ణ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలోని భట్రాజు కులసంఘం సభ్యులు పాల్గొన్నారు.