ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తా : కార్పొరేట
Published: Monday March 29, 2021
శేరిలింగంపల్లి, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ప్రణీత్ విల్లాస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరనారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ప్రణీత్ విల్లాస్ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీ లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి, కాలనీ అధ్యక్షులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీవాసులు తమ దృష్టికి తీసుకు వచ్చిన కాలనీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన అన్నారు. కాలనీల్లో అవసరమైన చోట వీధిలైట్ల ను ఏర్పాటు చేస్తానని, డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో నే ఉంటూ, డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణీత్ విల్లాస్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: