కౌలు రైతులకి ఇందిరమ్మ రైతు భరోసా

Published: Friday May 27, 2022

జన్నారం రూరల్, మే 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి గ్రామంలో ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ నాయక్  వరంగల్ డిక్లకరేషన్ పోస్టర్ ని గురువారం రచ్చబండ కార్యక్రమంలో  ఆవిష్కరించారు, ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో వరంగల్ డిక్లరేషన్ చెప్పినట్టు ఇందిరమ్మ రైతు భరోసా, కౌలు రైతులకి ఏడాదికి ఒక లక్ష యాబైవేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు, ఈ సందర్బంగా కౌలు రైతులు హర్షం వ్యక్తం చేసారు, యాసంగి పంట వరి దాన్యం తరుగు తూకంలో మెుసం చేయకుండ తొందరగా కోనుగోలు చేసి ప్రభుత్వం అదుకొనాలని కాంగ్రెస్ నాయకులు, రైతులు కోరారు, ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి,, సర్పంచ్ శంకర్ , ఫాసిఉల్లా, ఎంబడిపల్లి మహేష్, పట్టణ అధ్యక్షుడు  దుమల్ల రమేష్, ప్రవీణ్, అజర్, రోహిదాస్ ,గ్రామ కాంగ్రెస్ నాయకులు చుంచు నర్సయ్య , తిరుపతి, కండ్రా వెంకటేష్ , శివ, సత్యం, పుణ్య నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.