నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి విక్రమార్క దంపతులు

Published: Tuesday March 07, 2023

మధిర, మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దంపతులు సోమవారం ప్రత్యేక అభిషేకాలు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం జరగబోయే కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రములు. ముత్యాల తలంబ్రాలు. మంగళ సూత్రాలను స్వామివారికి సమర్పించినారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖ వినయ్ దేవాలయ ఈవో పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ,మధిర మాజీ మార్కెట్ చైర్మన్ రంగా హనుమంతరావు, మధిర మున్సిపల్ కౌన్సిలర్ కోన దని కుమార్ సుచరిత, వైరా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి,పిసిసి మెంబర్ రాందాస్ నాయక్ ,ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు వనమా సూరి ,మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర రెడ్డి,గడ్డం అనిత. తదితరులు పాల్గొని పూజలు నిర్వహించినారు.