ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Published: Monday April 11, 2022
మంచిర్యాల టౌన్, ఏప్రిల్10, ప్రజాపాలన:  శ్రీరామ నవమి సందర్బంగా పాత మంచిర్యాల శ్రీ రామాలయం, శివాలయం, భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారికి కళ్యాణంలో  మంచిర్యాల ఎమ్మెల్యే దంపతులు నడిపెల్లి రాజకుమారి, దివాకర్ రావు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు తలంబ్రాలు, నగదు యాభై వేల రూపాయలు విరాళంగా సమర్పించారు. మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ లో జరిగిన శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు.  దంపతులు నడిపెల్లి ఉదయ శ్రీ విజిత్ కుమార్ లు నగదు యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కల్యాణలో పాల్గొన్న మాజీ ఎమ్మేల్సీ. మంచిర్యాల జిల్లాలో ఆదివారం రోజున శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో గల భక్తాంజనేయ ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.