ఆగస్టు 3న చలో హైదరాబాద్ ** సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లోకేష్ ** సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాలు వి

Published: Thursday July 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై27(ప్రజాపాలన, ప్రతినిధి) : ఆగస్టు 3న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి లోకేష్, రాజేందర్ లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బుధవారం సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాల చట్ట పరిధిలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్లు ఉన్నాయని, వీటిలో సుమారు కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, హమాలి, భవన నిర్మాణ ట్రాన్స్పోర్ట్స్, ఇతర రంగాల కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని, వచ్చే నెల ఆగస్టు 3న చలో హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి జిల్లాలో ని కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్తారి, మోతే తిరుపతి, రాకేష్, రేగుంట రాకేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.