శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి విజయవంతం చేయాలి

Published: Friday February 18, 2022
నేనవత్ శ్రీనివాస్ నాయక్
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేది 17 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం  సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి  సందర్భంగా. ఈ నెల 20వ తేది ఆదివారం రోజు కొర్ర శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో బోడ కొండ గ్రామంలోని జగదాంబ దేవాలయం ఆవరణలో జరిగే సేవాలాల్ జయంతి కార్యక్రమనికి హాజరు కావాలని బంజారా నాయకులు మంచాల మండలం తహసీల్దార్ అధికారి దేవుజ నాయక్ ని.కలిసి పత్రిక అంద జేసారు ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ ఈ నెల20 తేదీ రోజు బోడ కొండ గ్రామంలో జరిగే సేవలాల్ జయంతి కార్యక్రమనికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అధికారులు పోలీస్ అధికారులు బంజారా నాయకులు పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి కార్యక్రమనికి హాజరు అయ్యి సేవలాల్ జయంతి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాలు నాయక్ దేవా సొత్.దేవరాం నాయక్ జాటోత్ బిచ్చు నాయక్ జాటోత్. లోక్యత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు