రాజు పాలెం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.....

Published: Wednesday January 12, 2022
ఎర్రుపాలెం జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో వీర్ బ్యాక్ యానిమల్ హెల్త్ లిమిటెడ్ ప్రోత్సాహంతో గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ని మంగళవారం రోజున ప్రారంభం చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వై కే గార్గ్ వీర్ బ్యాక్ యానిమల్ హెల్త్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, సిరాజుద్దీన్ రీజినల్ మేనేజర్, సోమ శ్రీనివాస్ ఏరియా మేనేజర్ విచ్చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ బూస్ పల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ వీర్ బ్యాక్ కంపెనీవారు ప్రోత్సాహం వలన మా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించుకున్నమని దానికిగాను గ్రామపంచాయతీ తరుపున, మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూస్ పల్లి వెంకటరెడ్డి, ఎంపీటీసీ దోమందుల సామేలు, ఉప సర్పంచ్ వేముల వెంకటరమణ, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కార్యదర్శి శివకుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.