కాంగ్రెస్ అద్వార్యంలో మోదీ దిష్టి బొమ్మ దగ్దం.

Published: Thursday February 10, 2022
జన్నారం రూరల్, పిబ్రవరి 09, ప్రజాపాలన: తెలంగాణ పట్ల పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా ప్రజలను అవమాన పరిచే విధంగా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పిలుపు మెరకు మెాదీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జి మెహన్ రెడ్డి మాట్లాడుతూ నాడు కేంద్ర ప్రభుత్వలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన తెలంగాణా ప్రజల అభిప్రాయం మేరకు ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ  సోనియా గాంధీ కృతజ్ఞతాలు తెల్పాలని అన్నారు. తెలంగాణా ప్రజలను అవమానిచ్చే విధంగా మాట్లాడినా మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని లేనియెాడల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసీఉల్లా, పట్టణ అధ్యక్షులు దుమాల రమేష్, ఎం పి టీ సి కరుణాకర్, మండల ప్రచారకార్యదర్శి, కార్యదర్శి ఎం డి అజహర్, లకావత్ తిరుపతి, ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు ఇందయ్య, మండల మైనారిటీ అధ్యక్షులు వసీం పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, అబ్దుల్ ముజ్జు, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.