ఘనంగా ముదిరాజ్ లా జెండా పండుగ శంకరపట్నం నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి:
Published: Tuesday November 22, 2022
ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కీసర సంపత్ ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేసి, స్థానిక కూరగాయల మార్కెట్ నుండి తాసిల్దారు ఆఫీస్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు . మండల కేంద్రంలోని వివిధ గ్రామాల మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు తో పాటుగా సంఘ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటుగా ముదిరాజ్ మండల యువత అధ్యక్షులు గుల్ల రాజు,యువత ప్రధాన కార్యదర్శి రెడ్డి సురేష్, గౌరవాధ్యక్షులు పోలవేణి బిక్షపతి, యువత విభాగం సెక్రటరీ నూనె సతీష్ ,ముఖ్య అతిథి ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె స్వరూప పాల్గొని తాసిల్దారు శ్రీనివాస్ రావు కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు .అందులో ముఖ్యంగా విద్య ఉద్యోగం పరంగా జరుగుతున్న అన్యాయం ర్ను్ను్ బీసీ డీ నుండి బీసీఏకు మార్చుట
మత్స్య సంపద దోపిడి నివారణకు ఒక ప్రత్యేక చట్టం, ముదిరాజ్ కుటుంబాల అభివృద్ధికి 1,000 కోట్లతో ఒక ప్రత్యేకమైన ప్యాకేజీతో కూడినటువంటి వినతిపత్రం అందజేశారు .
Share this on your social network: