సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి

Published: Saturday December 17, 2022
మేడిపల్లి, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి చామకూర మల్లారెడ్డి 

ఆదేశాలను అనుసరిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో బీఅర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి పాల్గొన్నారు.   నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు.