డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి

Published: Wednesday July 07, 2021
కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్
మేడిపల్లి, జులై 6 (ప్రజాపాలన ప్రతినిధి) : డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్ జెసిబితో రోడ్డు పక్కనున్న చెత్తా చెదారంతో పాటు పిచ్చి మొక్కలను పరిశుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొంతరబోయిన కృపాసాగర్ ముదిరాజ్, 22వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పోకల రవీందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రంగనాథం, డివిజన్ ఇంచార్జి సత్యనారాయణ యాదవ్, మహిళా ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మీ, బీసీ సెల్ అధ్యక్షులు భూమయ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.