సైబర్ క్రైమ్ సెక్షన్ ల పై అవగాహన కలిగి ఉండాలి

Published: Wednesday June 02, 2021

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్ జిల్లా, జూన్ 01, (ప్రజాపాలన ప్రతినిధి) : మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సఖి కేంద్రం ఆధ్వర్యంలో ప్రచురించిన గోడ ప్రతులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సైబర్ క్రైం కి సంబంధించిన విషయాలపై ప్రజలలో మరింత అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, సంబంధిత సెక్షన్ ల వివరాలు విద్యార్థులు, మహిళలు, తెలుసుకునే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలలో ఈ ప్రతులను ప్రచురించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, సిడిపివో లు సాధన, విజయలక్ష్మి, సురేఖ, సఖి కేంద్ర నిర్వాహకులు సౌజన్య, సుమలత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.