జడ్పీ సమావేశానికి హాజరైన జడ్పీటీసీ ప్రమీల..*

Published: Thursday January 05, 2023
తల్లాడ, జనవరి 4 (ప్రజాపాలన న్యూస్):
 *ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జడ్పి సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సమావేశానికి తల్లాడ మండల జడ్పిటిసి దిరిశాల ప్రమీల హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో పలు సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జిల్లా అధికారులు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చినట్లు జడ్పిటిసి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 6వ తేదీన మండలంలో రాష్ట్ర మంత్రులు హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసు రావు ఉన్నారు.*