పంటకు సాగు నీరు అందించేందుకు చర్యలు : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

Published: Wednesday April 27, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 26 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో రైతులు సాగు చేసే వంటకు సకాలంలో సాగునీరు అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తో కలిసినీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఆడ, వట్టి వాగు ప్రాజెక్టుల కింద ఖరీఫ్ సీజన్కు సాగునీరు అందించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువలలో ఎలాంటి పూడిక లేకుండా తొలగింపు పనులు చేపట్టాలని చెరువులు కుంటల కింద తూముల ద్వారా సాగునీరు అందించేందుకు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. పనుల నిర్వహణలో సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమములో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.