పట్టుదల తో శ్రమిస్తే విజయం మీదే: ఉమ్మడి కరీం నగర్ జిల్లా డిప్యూటి రవాణా కమీషనర్ మామిండ్ల చంద

Published: Friday July 01, 2022
కరీంనగర్ జూన్ 30 ప్రజాతంత్ర  ప్రతినిధి :
 అనుకున్నది సాధించాలనే పట్టుదల ,సంకల్ప బలం తో శ్రమిస్తే ప్రభుత్వ ఉద్యోగాన్ని సులబంగా సాధించవచ్చని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ రవాణా కమీషనర్  మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పిలుపు నిచ్చారు.    ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమి,యంగ్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్సై, పలు పోటీ పరీక్షలపై అవగాహన  సదస్సు కు ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  జారీ  చేసిన ఉద్యోగ నియామకాల అవకాశాలను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత,నిరంతర  సాధనతో ముందుకు సాగాలన్నారు. ప్రగాడ విశ్వాసంతో సమా యత్తం అవ్వాలని తద్వారా ఉద్యోగాలు సాధించడం సులబతరంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించి తీరాలనే  తపన కలిగి ఉండాలని సూచించారు. పోటీ పరీక్షా విధానం లో ప్రతీ ప్రశ్న,ప్రతీ మార్కు ఎంతో కీలకమని బావించి, సిలబస్ కు,పరీక్షా విధానానికి అనుగుణంగా  పాత ప్రశ్నా పత్రాలను విశ్లేషించుకుంటూ చదవడంతో పాటు ఎప్పటికప్పుడు పునశ్చరణ  చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా మిషన్,ద్రోణాచార్య అకాడమి  ప్రతినిధులు ఘన్ శ్యామ్ ఓఝా, లెంకల మహిపాల్ రెడ్డి, భూమడి గణేష్ రెడ్డి,విశ్వనాథ బలరామ్,వెలుదుర్తి మురళి,చింపూల అనిల్ తదితరులు పాల్గొన్నారు.