గద్దపాక లో బిజెపి మండల కార్యవర్గ సమావేశం శంకరపట్నం ఫిబ్రవరి 3 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday February 04, 2023

శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగు భాస్కరాచార్యులు, గడ్డం నాగరాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఫిబ్రవరి 10 నుండి 25 వరకు స్వీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని మండల కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.మండలంలోని అనేక గ్రామాలలో రోడ్లు విద్యుత్ సమస్యలపై ఏసీడీ చార్జీల పెంపుపై ఉద్యమం చేయాలని ఫీజు రియంబర్స్మెంట్, అర్హులైన వారందరికీ దళిత బంధు ఇవ్వాలని, దళితులకు గతంలో ఇచ్చిన మూడెకరాల భూమి హామీలను అమలు చేయాలని నిరుద్యోగ భృతి 3016 రూపాయలను వెంటనే అందించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సీనియర్ నాయకుడు పలకల రాజిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అంతం రాజిరెడ్డి, జంగా జయపాల్, మండల ప్రధాన కార్యదర్శిలు ఎలుక పెళ్లి సంపత్ దాసరపు నరేందర్ మండల ఉపాధ్యక్షులు జనపట్ల రాజిరెడ్డి, పిన్ రెడ్డి సంపత్ రెడ్డి, పెసరి వీరా అర్జున్, కార్యదర్శులు వడ్లకొండ రాజేందర్, దాసరి సంపత్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మందాడి జగ్గారెడ్డి, ఓ బీసీ మోర్చా మండల అధ్యక్షుడు గౌరవేని శ్రీనివాస్, యువ మోర్చా మండల అధ్యక్షుడు బొడిగ నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్,  మోర్చల ప్రధాన కార్యదర్శి బోడ తిరుపతిరెడ్డి, రంజిత్, రమణారెడ్డి, వివిధ గ్రామాల  బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు .