ఖమ్మంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

Published: Monday July 18, 2022
మధిర రూరల్ జూలై 16 ప్రజాపాల ప్రతినిధిమధిర నియోజకవర్గంలో 5 మండలాల అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల.ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా గూడూరు రమణారెడ్డి నియామకం.వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం ఈ రోజు ఖమ్మం పార్టీ కార్యాలయంలో జరిగింది.పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ఖమ్మం జిల్లా పరిశీలకులు పిట్టా రామిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపల్లి కవిత,జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ ,మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్  దొంతమాల కేకేడి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మధిర నియోజకవర్గ 5 మండలాల అధ్యక్షులను కిషోర్ కుమార్ దొంతమాలఅధికారికంగాప్రకటించారు.ఎర్రుపాలెం మండలాధ్యక్షుడిగా వై కోటారెడ్డి, మధిర-దేవంభట్ల శ్రీనివాస్ శాస్త్రి,బోనకల్-ఇరుగు జ్ఞానేశ్,చింతకాని-వాకా వీరారెడ్డి,ముదిగొండ-సామినేని రవిని మండలాధ్యక్షులుగానియమించారు.అదేవిధంగా ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి,మధిర నియోజకవర్గ పరిశీలకులుగా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడుకి చెందిన గూడూరు రమణారెడ్డిని నియమించారు.మధిర మండల అధికార ప్రతినిధిగా వర్రే మరియదాసును నియమించినట్లు కిషోర్ కుమార్ కేకేడి తెలిపారు.