తలస్సెమియా, సికిల్ సెల్ పిల్లలకు, తల్లితండ్రులకు అవగాహణ కార్యక్రమం

Published: Saturday November 05, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 04, ప్రజాపాలన: తలస్సెమియా, సికిల్ సెల్ పిల్లలకు, తల్లితండ్రులకు    ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ ఆద్వర్యంలో, డాక్టర్ కె వి ఆర్  ఫౌండేషన్ ఫౌండేర్ సి ఇ ఒ  శైలేష్ బాబు   తలస్సెమియా టాస్క్ ఫోర్స్, ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటి  తెలంగాణ రాష్ట్ర శాఖ వారి సహకారంతో  మంచిర్యాల రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం లో శుక్రవారం అవగాహణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   తలస్సెమియా వ్యాది గురించి, దానిని ఎలా నిర్మూలించాలి అనే దానిపై తోటి రెడ్ క్రాస్ స్టాఫ్ కు  తలస్సెమియా, సికిల్ సెల్ పిల్లలకు వారి  తల్లి తండ్రులకు అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ చందూరి మహేంధర్, జిల్లా కోశాదికారి పడాల రవింధర్, తలస్సెమియా సికిల్ సెల్ పిల్లలు, తల్లి తండ్రులు, రక్త నిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.