తలస్సెమియా, సికిల్ సెల్ పిల్లలకు, తల్లితండ్రులకు అవగాహణ కార్యక్రమం
Published: Saturday November 05, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 04, ప్రజాపాలన: తలస్సెమియా, సికిల్ సెల్ పిల్లలకు, తల్లితండ్రులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ ఆద్వర్యంలో, డాక్టర్ కె వి ఆర్ ఫౌండేషన్ ఫౌండేర్ సి ఇ ఒ శైలేష్ బాబు తలస్సెమియా టాస్క్ ఫోర్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి తెలంగాణ రాష్ట్ర శాఖ వారి సహకారంతో మంచిర్యాల రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం లో శుక్రవారం అవగాహణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలస్సెమియా వ్యాది గురించి, దానిని ఎలా నిర్మూలించాలి అనే దానిపై తోటి రెడ్ క్రాస్ స్టాఫ్ కు తలస్సెమియా, సికిల్ సెల్ పిల్లలకు వారి తల్లి తండ్రులకు అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ చందూరి మహేంధర్, జిల్లా కోశాదికారి పడాల రవింధర్, తలస్సెమియా సికిల్ సెల్ పిల్లలు, తల్లి తండ్రులు, రక్త నిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: