శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పున:నిర్మాణానికి విరాళం

Published: Sunday October 10, 2021
కొడిమ్యాల, అక్టోబర్ 09 ( ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణంకు గ్రామానికి చెందిన పిట్టల లచ్చయ్య దేవక్క కుమారులు అరుణ్, మహేష్ ల కుటుంబము శాశ్వత చందాదారులుగా 25 వేల రూపాయలను ఆలయ నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది. వీరి కుటుంబానికి ఆలయ అర్చకులు నాగరాజు, రమేష్ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించడం జరిగింది. వీరికి వీరి కుటుంబానికి గ్రామస్తులు తరపున మరియు ఆలయ నిర్మాణ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.