ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్క

Published: Monday December 12, 2022
తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడలో తుది దశ చేరుకున్న కోహెడ పండ్ల మార్కెట్ డి.పి.ఆర్ ను వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మార్కెటింగ్ శాఖ అధికారులతో పరిశీలించారు.
అనంతరం మార్కెట్ నిర్మాణం కానున్న స్థలాన్ని పరిశీలించారు.
మంత్రి  మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం కానున్న కోహెడ పండ్ల మార్కెట్ సంక్రాంతి తరువాత ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్  చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ ఆర్.లక్ష్మణుడు, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.