శాసన మండలిలో ప్రశ్నించే గళాన్ని గెలిపిద్దాం...!

Published: Thursday March 09, 2023
* బిజెపి పట్టణ ఇంచార్జ్ మరాఠి శివప్రసాద్
వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన :
ఉమ్మడి మహబూబ్ నగర్ -రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని బిజెపి పట్టణ ఇంచార్జ్ మరాఠి శివప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలపర్చిన ఎమ్మేల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రచారం చేసిన బిజెపి పట్టణ ఇంచార్జ్ మరాఠి శివప్రసాద్. పోలింగ్ తేది 13 మార్చి 2023 సోమవారం. సమయం : ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు.