మాటూరు గ్రామంలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి ఉత్సవ కార్యక్రమం

Published: Friday August 20, 2021
మధిర, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు గ్రామం నందు గురువారం శ్రావణమాసం పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ తల్లి ఉత్సవ  కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు మరియు పెద్దల సహాయ సహకారంతో అత్యంత వైభవోపేతంగా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ ఉత్సవ కార్యక్రమంలో అమ్మవారు పూనకం రూపంలో ప్రజలకు దర్శనమివ్వడం వాక్కు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ కోటేశ్వరావు గ్రామ పూజారి వీరం శెట్టి పూర్ణయ్య గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు