మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం మల్

Published: Monday July 18, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.


  మహిళా సమస్యలు  పరిష్కరించడంలో గానీ, మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విక్రమవుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు అన్నారు.
      తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని మన్నెగూడ క్రాస్ రోడ్ లో గల విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈరోజు రంగారెడ్డి జిల్లా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం విస్తృతస్థాయి సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ గారి అధ్యక్షతన జరిగింది.
     ఈ సందర్భంగా లక్ష్మీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై అనేక రకాలుగా దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి రేషన్ ద్వారా 14 రకాల సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక పక్కన ఉపాధి లేక మరోపక్క నిత్యవసర సరుకులు ధరలు ఆకాశానికి అంటుతుంటే మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు కేరళ తమిళనాడులో ప్రభుత్వం రేషన్ ద్వారా 14 రకాల వస్తువులను ఇస్తున్నారని తెలంగాణలో కూడా అటువంటి విధానాలను అమలు చేయాలని అన్నారు అట్లాగే  ప్రతి మహిళకు పొదుపు  సంఘాల ద్వారా  వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, రెండు పడకల ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలు వంట ఇంటికే పరిమితం కాకుండా సమాజం పట్ల అవగాహన పెంచుకుని అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని పిలుపునిచ్చారు.
         ఈ కార్యక్రమంలో మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి సుమలత, శ్రామిక మహిళ నాయకురాలు కవిత, ఐద్వా నాయకులు విజయ కె.శారద, మమత,సంధ్య ఉమా, లక్ష్మి , రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు 
 
 
 
Attachments area