దాడులు పట్ల బిజెపి విజయాన్ని ఆపలేరు

Published: Thursday November 03, 2022

మధిర  నవంబర్ 2( ప్రజా పలన ప్రతినిధి) దాడులతో ప్రజలను భయబ్రాంతులు చేసేందుకు  టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని బిజెపి ఖమ్మం జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళపల్లి విజయరాజు అన్నారు. బుధవారం మధిరలో ఆర్వి కాంప్లెక్స్ సెంటర్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన  దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని వారు  ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాలకు టీఆర్ఎస్ పాల్పడటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు టిఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గడంతో టిఆర్ఎస్ నాయకులు అసహనానికి గురై దాడులకు పాల్పడుతున్నారన్నారు. మునుగోడులో బీజేపీదే గెలుపు అని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండా చంద్రశేఖర్ రెడ్డి, రాము,పగడాల నాగేంద్రబాబు, పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, పెరుమాళ్ళపల్లి శ్రీకాంత్, బెజ్జం శ్యామ్, రాము వినయ్, రమేష్, రాజు, ప్రసాద్ సంజీవరావు, ఆగస్టీన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.