ఎన్.సి. కార్పొరేషన్ రుణాల మంజూరులో పథకాల మార్పులు ఈ నెల 30 లోగా చేనుకోండి: కార్యనిర్వాహక నంచాల

Published: Thursday March 18, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి,మార్చి 17, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్.సి. కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అదనంగా చేర్చబడిన పథకాలను ఆన్ లైన్ లో ఈ నెల 30వ తేదీ లోగా మార్చుకోవచ్చని షెడ్యూల్డ్ కులముల సేవా నహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఎ.హరినాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రుణాల మంజూరులో 47 పథకాలు ఉండగా అదనంగా మరో 37 పథకాలను చేర్చడం జరిగిందని, ఇతర పథకాలకు మార్చాలనుకునే వారు ఆన్లైన్ లో http://tsobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు మార్చుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు