జనం ఇలా... కరోనా రాక ఎలా..?
Published: Monday May 24, 2021
రాయికల్, మే 23 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ పట్టణ కేంద్రంలో ని మార్కెట్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన వేల ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే సమయం కొంచెం ఉన్న నేపథ్యంలో జనాలు ఒక్కసారిగా ఇళ్లలో నుండి బయటకు వస్తున్నారు. కావున అందరూ గుంపులు గుంపులుగా రావడంతో రోడ్లన్నీ జాతరను తలపిస్తున్నాయి. ఎక్కడా కూడా సామాజిక దూరం పాటించడం లేదు. పోలీసులు కరోనా కట్టడికి 10 గంటల తరువాత ఎంతో కష్టపడి లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయిన కూడా జనంలో అవగాహన రాకపోవడంతో పోలీసుల కష్టానికి విలువ లేకుండా పోయింది. ఇలా అయితే కరోనా కట్టడికి ఎన్నిరోజులు లాక్ డౌన్ విధించినా కరోనాను కట్టడిచేయలేమని అందరూ అనుకుంటున్నారు. ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించాలని భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network: