అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

Published: Wednesday May 25, 2022
మేడిపల్లి, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి)
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అధికారిక విడుదల ప్రకారం 2022–2024 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం జిల్లా  సమాచార,  పౌర సంబంధాల శాఖ అధికారికి దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు  ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు జూన్ 30వ తేదీతో ముగుస్తుందని అలాగే 2022–2024 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డ్లు జారీ చేయబడతాయని తెలిపారు. దీనికి సంబంధించి  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తమ సంస్థలకు చెందిన వర్కింగ్ జర్నలిస్ట్ల పేర్ల జాబితాను జూన్ 4వ తేదీ (04–06–2022)లోగా జిల్లా సమాచార ,  ప్రజాసంబంధాల విభాగానికి తప్పనిసరిగా సమర్పించవలసిందిగా కలెక్టర్ హరీశ్ వివరించారు.  దీంతో పాటు స్వతంత్ర వర్గానికి చెందిన జర్నలిస్టులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల పేర్లను జిల్లాల సంబంధిత డీపీఆర్వోకు పంపవచ్చన్నారు.  మేనేజ్మెంట్లు తమ పేర్లను పంపిన జర్నలిస్టులు 25.05.2022 నుండి 04.06.2022 వరకు డిపార్ట్మెంట్ వెబ్సైట్ http://ipr.telangana.gov.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్ ద్వారా అక్రిడిటేషన్ కార్డ్ల కోసం తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.