రుణాలు పంపిణీ చేసిన చైర్మన్ ప్రదీప్ రెడ్డి..

Published: Wednesday September 21, 2022
తల్లాడ, సెప్టెంబర్ 20 (ప్రజాపాలన న్యూస్):
   మండల పరిధిలోని  కుర్నవల్లి సొసైటీలో మంగళవారం 22 మందికి 16 లక్షలను  సొసైటీ చైర్మన్  అయిలూరి ప్రదీప్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని   రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు . రైతులందరూ తీసుకున్న రుణాలకు మార్చి 31 లోపు వడ్డీ కట్టి  రెన్యువల్ చేయించుకోవాలన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో సొసైటీ అభివృద్ధికి విస్తృతంగా  కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిసిసిబి మేనేజర్ రమ్య శ్రీ, సూపర్వైజర్ ఓం ప్రకాష్ , సీఈవో ఒగ్గు నరసింహారెడ్డి   పాల్గొన్నారు